- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలిలోని ఏషియన్ఇ నిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించారు. వైద్యులు ఆయనకి కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నట్టు తెలుస్తుంది. శస్త్ర చికిత్స సమయంలో రక్తం కావలసి ఉంటుందని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోమని సన్నిహితులకి చెప్పినట్టు సమాచారం. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్లో అశోక్ తేజ రాసిన నేను సైతం పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన గేయాలతో అలరించిన అశోక్ తేజ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Suddala Ashok Teja Admit in Hospital with Kidney Issue
- Advertisement -