- Advertisement -
హైదరాబాద్: పిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కీ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఎల్ బి నగర్ ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి విమర్శించారు. మధుయాష్కీ తనపై ప్రయోగించిన పరుష పదజాలాన్ని బదులుగా సుధీర్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. మధుయాష్కీ కుటుంబ చరిత్ర మొత్తం తన దగ్గర ఉందని, ఆయన అక్రమాలపై ఎక్కడకు పిలిచినా చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఆయనపై అమెరికాలో కేసులు ఉన్నాయని ఆరోపణలు చేశారు.
- Advertisement -