Saturday, April 27, 2024

నవదంపతుల ఆత్మహత్యాయత్నం.. వరుడు మృతి

- Advertisement -
- Advertisement -

Suicide attempt by a newlywed couple: Groome died

 

మనతెలంగాణ/నిజామాబాద్ : వేధింపులు భరించలేక నవదంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో వరుడు మృతిచెందగా వధువు చికిత్స పొందుతున్న సంఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రానికి చెందిన సాయిప్రణీత్(19) అనే వ్యక్తి కోటగిరికి చెందిన విజయను ప్రేమించి గత 15రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న ప్రణీత్ విజయలు వేరేగా ఉండేందుకు విజయ తల్లి సున్నం సావిత్రి తిరస్కరించింది. అంతేకాకుండా ఇరువురి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకపోవడంతో పాటు ఇరువురిని వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇరువు ఈ నెల 15న పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అక్కడున్నవారు ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు సాయి ప్రణీత్ గురువారం మృతి చెందగా విజయ ప్రస్తుతం చికిత్స పొందుతుంది. సాయి ప్రణీత్ మృతికి సున్నం సావిత్రి కారణమని ఆరోపిస్తు మృతుడి తండ్రి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొటగిరి ఎస్సై మచ్చందర్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News