Saturday, April 27, 2024

సునందా మృతి కేసు: కాంగ్రెస్ ఎంపి శ‌శి థ‌రూర్‌కు ఊరట..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి, మాజీ మంత్రి శ‌శి థ‌రూర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట ల‌భించింది. తన భార్య సునందా పుష్క‌ర్  మృతి కేసులో ఎంపి శ‌శిథ‌రూర్‌పై ఉన్న అభియోగాలను బుధవారం కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఎంపి శశిథరూర్ ను ఢిల్లీ సెషన్స్ కోర్టు నిర్ధోషిగా తీర్పు వెల్లడించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు.. సునందా ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. అయితే,  సునందా ఆత్మహత్య చేసుకునేలా శశిథరూర్ ప్రవర్తించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో శశిథరూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ సెషన్స్ కోర్టు, శ‌శిథ‌రూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టేసింది.

Sunanda death Case: Delhi Court discharges Shashi Tharoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News