- Advertisement -
చెన్నై: రానున్న ఐపిఎల్ సీజన్ను దృష్టిలో పెట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు మాజీ ప్రధాన కోచ్ టామ్ మూడీకి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించింది. మూడీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఎంపిక చేసింది. అతని సలహాలు, సూచనలు జట్టుకు ఎంతో అవసరమని, అందుకే అతనికి ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్టు సన్రైజర్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుండగా గతంలో టామ్ మూడీ 2013 నుంచి 2019 వరక్ సన్రైజర్స్కోచ్గా కొనసాగాడు. ఈ ఏడాది మాత్రం మూడీ స్థానంలో ట్రెవర్ బెయిలిస్ను ప్రధాన కోచ్గా నియమించిన విషయం తెలిసిందే.
- Advertisement -