కొలంబో: శ్రీలంక పర్యటనలో రాణించిన టీమిండియా బ్యాట్స్మన్స్ సూర్యకుమార్ యాదవ్, పృథ్వా షా ఇద్దరూ సోమవారం ఇంగ్లండ్కు బయల్డేరాడు. రేపటి(బుధవారం)నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ కు ముందే ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. శుభుమన్ గిల్, మయాంక అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ లు గాయపడడంతో శ్రీలంక టూర్ లో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను ఇంగ్లండ్ కు పంపించాలని బిసిసిఐ భావించింది. ఈ క్రమంలోనే కృనాల్ పాండ్యాకు కొవిడ్ సోకడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వీరు ఐసోలేషన్లోకి వెళ్లాల్సివచ్చింది. తాజాగా ఐసోలేషన్లో పూర్తిచేసుకున్న సూర్యకుమార్, షాలు ఇండియన్ టెస్ట్ టీమ్లో చేరేందుకు ఈ రోజు ఇంగ్లండ్ కు బయల్దేరారు. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతున్న ఫోటోలను సూర్యకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెక్ట్స్ స్టాప్ ఇంగ్లండ్ అని కామెంట్ కూడా పెట్టాడు. అయితే, సూర్యకుమార్, షా ఇద్దరూ తొలి రెండు టెస్టుల తర్వాత మూడో టెస్టుకు టీమ్ సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నారు.
Counting my blessings 💫
Next stop, England! pic.twitter.com/0uuiKfvDRB— Surya Kumar Yadav (@surya_14kumar) August 3, 2021
Suryakumar Yadav and Prithvi shaw leaves for England tests