Saturday, April 27, 2024

అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే

- Advertisement -
- Advertisement -

Taapsee says i enjoys the Trolling

 

ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయింది అందాల తార తాప్సీ. అక్కడామెకు క్రేజ్ ఉంది. అయితే సౌత్ సినిమాను తాను వదులుకోనంటోంది ఈ పంజాబీ బ్యూటీ. కానీ ఇప్పటికీ సౌత్ నుంచి 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయని చెబుతోంది తాప్సీ. అందుకే పెద్ద హీరోల సినిమాలైనప్పటికీ వాటిని వదులుకుంటున్నానని స్పష్టంచేసింది. “సౌత్‌లో గత ఏడాది ‘గేమ్ ఓవర్’ చేశాను. అది తెలుగు, -తమిళ భాషల్లో రిలీజైంది. సౌత్‌లో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలనుకుంటాను. కానీ సమస్య ఏంటంటే.. ఎక్కువగా సౌత్‌లో గ్లామర్ రోల్స్ చేయడం వల్ల 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమా ఆఫర్లే అయినప్పటికీ అలాంటివి చేయను. అలా అని కథ మొత్తం నా చుట్టూరా తిరగాలని నేను కోరుకోను.

తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ నా పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఆ సినిమా చేస్తా. చిన్న పాత్ర చేసినా బలంగా ఉండాలి”అని తాప్సీ పేర్కొంది. ఇక ట్రోలింగ్స్‌పై స్పందిస్తూ… ట్రోలింగ్స్‌ను ఎంజాయ్ చేస్తానంటోంది ఈ బ్యూటీ. “నన్ను ట్రోల్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనలో విషయం ఉన్నప్పుడే కదా మనల్ని ట్రోల్ చేస్తారు. మనపై అందరి దృష్టి ఉంటేనే కదా మనం ట్రోలింగ్ కు గురవుతాం. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే. అందరూ నన్ను తిడుతున్నారంటే నా జీవితంలో విషయం ఉన్నట్టే కదా”అని తాప్సీ చెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News