- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రటించారు. సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు. థియేటర్లు మూసివేసే ఆలోచన తమకు లేదని మంత్రి తెలిపారు. సీటింగ్ విధానంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. థియేటర్ నిర్వాహకులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. మళ్లీ థియేటర్లు మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని, సినీ కార్మికులు రోడ్డున పడతారని మంత్రి చెప్పారు.
Talasani Srinivas Yadav Gives Clarity on Theatres
- Advertisement -