Monday, April 29, 2024

సిఎం పక్కన కూర్చున్న టిడిపి ఎంఎల్‌ఎ..!

- Advertisement -
- Advertisement -

TDP MLA sitting next to CM

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. సభ ప్రారంభం సమయంలో అధికార పార్టీకి చెందిన సభ్యులంతా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నమస్కరిస్తుండగా, ఆ సమయంలో సిఎంను కలిసేందుకు వచ్చిన అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన మెచ్చా నాగేశ్వరరావును సిఎం పక్కన కూర్చోపెట్టుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన సమస్యల వినతి పత్రాన్ని ఎంఎల్‌ఏ ఇవ్వగా సిఎం తీసుకున్నారు. అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని సిఎం హామీ ఇచ్చినట్లు నాగేశ్వరావు తెలిపారు. అయితే ప్రతిపక్షపార్టీలోని సభ్యులనూ సిఎం ఆప్యాయంగా పలకరించడంపై సదరు ఎంఎల్‌ఏ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ సిఎం కూడా ఇలా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News