హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు తీసి భారత్ కోలుకోలేని దెబ్బతీశాడు. మూడు ప్రధానమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కెఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండా జేమ్స్అండర్సన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వరా పూజారా ఒక పరుగు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి అండర్స్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అజింక్య రహానే 18 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(15), రిషబ్ పంత్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.
రహానే ఔట్… ఇండియా 56/4
- Advertisement -
- Advertisement -
- Advertisement -