Thursday, May 16, 2024

మూడో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 74 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ ఉంది. యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేసి జోయ్ రూట్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 23 పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (00), కెఎల్ రాహుల్ (39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్, టామ్ హార్ట్‌లే, జోయ్ రూట్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News