- Advertisement -
అహ్మదాబాద్: చారిత్రక మొతెరా మైదానంలో ఇంగ్లండ్తో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆదివారం సాధన ఆరంభించింది. అహ్మదాబాద్లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మైదానంలో ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య ఫ్లడ్ లైట్ల వెలుగులో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య భారత జట్టు ఆటగాళ్లు సాధన ప్రారంభించారు. శనివారం కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా క్రికెటర్లు ముమ్మర సాధన చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా మొతెరా గ్రౌండ్ పేరు తెచ్చుకుంది. ఈ స్టేడియాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథన్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కాగా ఫిబ్రవరి 24 నుంచి భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది.
Team India start practice at Motera Stadium
- Advertisement -