హైదరాబాద్: పెయింట్స్ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్ ఇటలీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్కు చెందిన టెక్నో పెయింట్స్ ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. దీనికోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులను బ్యాంకులతోపాటు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి సమీకరిస్తామని అన్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ఇటువంటి పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయని, కానీ తమ కంపెనీ వీటి తయారీలోకి ప్రవేశించిందని ఆయన వెల్లడించారు. నాణ్యమైన పెయింట్ల తయారీతోపాటు పెయింటింగ్ సేవలు అందిస్తున్న టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద నెలకొల్పుతోంది. ఈ ప్లాంటులో వార్షిక సామర్థ్యం 1.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండనుంది.
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ డీల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -