- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వర్షకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత దృష్టా శాసన సభ, మండలిని నిరవధిక వాయిదా వేశారు. గత ఎనిమిది రోజుల్లో 12 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత, కేంద్ర విద్యుత్ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై సభలో చర్చించారు. 8 రోజుల పాటు కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ సభకు సహకరించిన శాసన సభ్యులందరికీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎంఎల్ఎలకు, పోలీసు, అసెంబ్లీ సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో బిఎసి కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని స్పీకర్ తెలిపారు.
- Advertisement -