- Advertisement -
సిద్దిపేట: సిద్ధిపేట, దుబ్బాక తనకు రెండు కళ్ళు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దుబ్బాకలో అల్ట్రా మోడల్ టాయిలెట్స్ నూతన కూరగాయలమార్కెట్ను ప్రారంభించిన సందర్భంగా హరీష్ మాట్లాడారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత కూడా తానే తీసుకుంటానని, సిద్ధిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, దుబ్బాక మహిళల త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపానని, త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపిస్తానని, దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాక అంటే సిఎం కెసిఆర్ ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దుబ్బాక అభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని గుర్తు చేశారు.
- Advertisement -