Monday, May 6, 2024

కారుదే జోరు

- Advertisement -
- Advertisement -

74కు పైగా స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు
నేషనల్ సెఫాలజీ ఇన్‌స్టిట్యూట్ ఒపీనియన్ పోల్ అధ్యయనంలో వెల్లడి
గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా…పలు సర్వేల్లో వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు కనిపిస్తున్నట్లు వివిధ సర్వేలు ఇప్పటికే వెల్లడించగా, తాజాగా మరోసారి బిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టనుందని నేషనల్ సెఫాలజీ ఇన్‌స్టిట్యూట్ ఒపీనియన్ పోల్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి 74 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడించింది. గులాబీ పార్టీ 74 సీట్లకు అదనంగా 5 పెరుగొచ్చు లేదా తగ్గొచ్చు అని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 29 సీట్లు (3 ప్లస్ ఆర్ మైనస్), బిజెపి 6 సీట్లు (2 ప్లస్ ఆర్ మైనస్), ఎఐఎంఐఎం 7 సీట్లు(1 ప్లస్ ఆర్ మైనస్) గెలిచే అవకాశం ఉందని ఒపీనియర్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన ప్రీ పోల్ ఒపీనియన్ ఫలితాలను నేషనల్ సెఫాలజీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసింది. ఈ ప్రీ పోల్ అధ్యయనం ద్వారా తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రజా పాలన అందిస్తున్నారని మరోసారి స్పష్టమైంది. అన్ని స్థానాలలో అభ్యర్థులు ఖరారైన తర్వాత ప్రీ పోల్ తుది ఫలితాలను వెల్లడిస్తామని నేషనల్ సెఫాలజీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్ సర్కార్…రాష్ట్రవ్యాప్తంగా చర్చ
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు బిఆర్‌ఎస్ నడుం బిగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గూలాబీ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించనుందని ఇప్పటికే వివిధ సర్వేలు వెల్లడించగా, తాజాగా నేషనల్ సెఫాలజీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో బిఆర్‌ఎస్ 74కుపైగా స్థానాలు గెలువనుందని తేలింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా మిన్నగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ అధినేత, అన్ని పార్టీల కంటే ముందుగానే మేనిఫెస్టోను ప్రకటించిన ప్రజల్లోకి వెళ్లారు. బిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో సబ్బండవర్గాలకు మేలు చేసే హామీలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది.

ముఖ్యంగా అభాగ్యులకు పింఛన్ల పెంపు సాహసోపేతమైన నిర్ణయంగా మేధావులు కీర్తిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకు రాబోతుండడం బిఆర్‌ఎస్ మానవీయతకు అద్దం పడుతున్నది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేకానేక పథకాల సమాహారంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చెప్పినవి చేసి, చెప్పనివి సైతం అమలు చేసి ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన సిఎం కెసిఆర్ పరిపాలనను దేశ వ్యాప్తంగా కీర్తిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగనున్నది.

కేంద్ర ప్రభుత్వం అమానవీయంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పడం బిఆర్‌ఎస్ పార్టీ గొప్పతనాన్ని చాటుకుంటున్నది. ఇక రైతుల మేలు కోసం పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచడంతో వ్యవసాయం పండుగలా మారనున్నది. దళితబంధు, రైతుబీమా వంటి కీలకమైన పథకాలు కొనసాగింపు ఉంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రైతుబీమా తరహాలోనే కెసిఆర్ బీమా …ప్రతి ఇంటికీ ధీమా పేరుతో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికీ ఎల్‌ఐసి ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా అందించబోతున్నారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంచుతున్నట్లుగా మెనిఫెస్టోలో ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతోపాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పడంతో అన్ని వర్గాల ప్రజలలో విశ్వాసం ఏర్పడి గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

opinion poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News