Tuesday, April 30, 2024

కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

Telangana CM KCR Cpmments On Corona

50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం

జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్‌సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం కెసిఆర్
వైకుంఠ ధామాల నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్యపై చర్చ, తక్షణమే రూ.1200కోట్ల అదనపు నిధులు మంజూరు 
మున్సిపాలిటీల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రత్యేక లే అవుట్‌లు
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చ, జ్వర సర్వే సహా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశం
మంగళవారం నాడు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం
నేడు మళ్లీ కేబినెట్ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేకంగా వార్షిక జాబ్ క్యాలెండర్ రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తలపెట్టింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యల పై చర్చించేందుకు బుధవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి అందరు కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రకాల పోస్టులతో ఖాళీలను గుర్తించిన తరువాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం వార్షిక క్యాలెండర్‌ను తయారు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.అలాగే హైదరాబాద్ నగర శివారులో నీటి ఎద్దడిని నివారణకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు మంజూరు చేస్తూ రా ష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మంగళవారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమ ంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం సుమారు ఏడు గంటల పాటు సుధీర్ఘంగా కొనసాగింది. వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జోనల్ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టిఎన్‌జివో, టిజివో సంఘాలు చేసిన విజ్ఞప్తిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కాగా రాష్ట్రంలో పది రోజుల పాటు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్‌కు నివేదికలు సమర్పించాయి. వాటిని క్షున్నంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు. నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని ఈ సందర్భంగా మంత్రులను ఆదేశించారు. అలాగే అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో స్థానిక విద్యార్ధులకు రిజర్వేషన్
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల్లో ఆయానియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎంఎల్‌ఎ, ఎంపిపి, జెడ్‌పి చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చ
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల మీద కేబినెట్ చర్చించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిథిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాలకోసం అభివృద్ధి చేసే లే- అవుట్లలో, లాండ్ పూలింగ్ ’ విధానాన్ని అమలు చేయాలనే అంశం పై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టిసారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
అలర్ట్‌గా ఉండాలి… ముందస్తు చర్యలు చేపట్టాలి
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్‌కు వివరించారు. మందు లు ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాల పై పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, జౌషదాల లభ్యత సహా మూడో వేవ్’ కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యరోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో, మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

Telangana Cabinet Meeting at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News