Monday, May 6, 2024

ఆగస్టులో తిరిగి మారేడుమిల్లి అడవుల్లోకి…

- Advertisement -
- Advertisement -

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్- ఇండియా యాక్షన్ చిత్రం ‘పుష్ప’. ఇంతకుముందు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్‌ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అనంతరం కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగుకి బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడడంతో తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదటి భాగం కోసం పెండింగ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. స్టైలిష్ అల్లు అర్జున్, ఇతర ప్రధాన తారలపై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ‘పుష్ప’హైదరాబాద్ షెడ్యూల్ జూలై చివరి నాటికి ముగుస్తుంది. తుది షెడ్యూల్ కోసం ఈ బృందం ఆగస్టులో తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తుంది. సుమారు 15 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ సాగుతుంది. తుది షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు సహా కొన్ని పాటలను చిత్రీకరిస్తారు. ‘పుష్ప’లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, – ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆర్య తర్వాత మళ్లీ ఆ రేంజులో ఆల్బమ్‌ని ఈ మూవీ కోసం అతను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News