- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1440 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసులు 2.5 లక్షలకు చేరుకోగా 1377 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.29 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 20 వేల మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 46.18 లక్షల మందికి కరోనా టెస్టులు చేసింది.
- Advertisement -