Friday, April 26, 2024

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ సిద్ధించింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానేత అంబేద్కర్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రి కెటిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ సిద్ధించిందన్నారు. భోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆశయాల్లో భాగంగానే తెలంగాణ సాధించుకున్నామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఇవాళ కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ జరిగిందన్నారు. త్వరలోనే నిర్మాణం చేపడుతామని, సిఎం కెసిఆర్ దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News