Wednesday, May 1, 2024

పెట్టుబడుల ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్
డెలివరీ సెంటర్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ అంగీకారం, మంత్రి కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ,
టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు మాండీహోల్డింగ్స్ సంసిద్ధత,
విస్తరణ ప్రతిపాదనలు చేసిన స్టోరబుల్ కంపెనీ,
వరంగల్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ‘రైట్’
పెట్టుబడులతో రావాలని చార్లెస్ స్కాబ్‌కు ఆహ్వానం,
రాష్ట్రంలో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ‘రేవ్‌గేర్స్’ ఆసక్తి,
వ్యాపార అవకాశాలపై చర్చించిన ‘టెక్‌జెన్స్’
10వేల మందికి ఉద్యోగావకాశాలు,
హ్యూస్టన్‌లో వరుస సమావేశాలతో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ బిజీబిజీ

మన తెలంగాణ/ హైదరాబాద్: మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో కాలు మోపనుంది. టెక్నాలజీ రంగంలోని వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకునే బైన్ క్యాపిటల్‌కు చెందిన విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శా ఖ మంత్రి కె.తారకరామారావుతో విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సిహెచ్‌ఆర్‌ఒ) ఎరికా బోగర్ కింగ్ హ్యూస్టన్‌లో సమావేశమయ్యారు. తమ సంస్థకు చెందిన డెలివరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తొమ్మిదేళ్ల స్వల్పకాలంలో నే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్ కింగ్‌కు మంత్రి కెటిఆర్ వివరించారు.

ప్రగతిశీల విధానాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపు ణ్యం గల శ్రామిక శక్తి తెలంగాణలో ఉన్నందునే ఎన్నో జాతీ య, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దా ర్శనికతతో ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని చెప్పారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటి పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందు లో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్న విషయాన్ని కెటిఆర్ ఎరికాతో ప్రస్తావించారు. డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలన్న విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ నిర్ణయంతో టెక్ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే అన్న సం గతి మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డైనమిక్ బిజినెస్ ఎకోసిస్టమ్ కారణంగానే తాము డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని విఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది. మొదటి మూడేళ్లల్లోనే ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొం ది. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ గ్లోబల్ సెంటర్ తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపింది.

పలు కంపెనీలతో సమావేశం
అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్‌లో మంత్రి కె.టి. రామారావు మరిన్ని కంపెనీలతో సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు కెటిఆర్ వివరించారు. ఇవాళ అంతర్జాతీయ సంస్థలెన్నో తెలంగాణ బాట పట్టాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడవాలని ఆహ్వానించారు. ఆయా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పె ట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి.

హైదరాబాద్‌లో మాండీ హోల్డింగ్స్
మాండి హోల్డింగ్స్ వ్యవస్థాపకు డు, చైర్మన్, సిఇఒ ప్రసాద్ గుం డు మొగుల నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం హ్యూస్టన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసింది. తె లంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చే సేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సెంటర్‌తో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపింది.

స్టోరబుల్ కంపెనీ విస్తరణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కలిగి ఉన్న స్టోరబుల్ కంపెనీ మరిన్ని విస్తరణ ప్రణాళికలను మంత్రి కెటిఆర్‌తో  సమావేశం అనంతరం ప్రకటించింది. స్టోరబుల్ కంపెనీకి చెందిన జొనాథన్ లూయిస్, నీల్ వర్మల నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం కెటిఆర్‌ను కలిసింది. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లో 41,000 స్టోరేజ్ సేవలను అందిస్తున్న ఈ టెక్ దిగ్గజం హైదరాబాద్‌లో ముందు 100 మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లను నియమించుకోనుంది. ఆ తర్వాత రీసెర్చ్ డెవలప్‌మెంట్ కోసం మరికొంతమంది నిపుణులను నియమించుకుంటామని తెలిపింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో పాటు స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.

రైట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం
రైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కె.టి. రామారావుతో సమావేశమైంది. హైదరాబాద్‌లో త్వరలో జరిగే డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కెటిఆర్‌ను కంపెనీ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఈ కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌తో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలతో కంపెనీకి భాగస్వామ్యం ఏర్పడుతుందని తెలిపింది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తామన్న రైట్ సాఫ్ట్‌వేర్, తమ విస్తరణ ప్రణాళికలను కెటిఆర్‌కు వివరించారు. త్వరలోనే వరంగల్ నగరంలో ఒక డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

మంత్రి కెటిఆర్‌తో చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్ ప్రతినిధుల భేటీ
బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రం గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్ ప్రతినిధి బృందం హ్యూస్టన్‌లో మంత్రి కెటిఆర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యా పార అవకాశాలతో పాటు ప్రభుత్వ విధానాలను వారికి కెటిఆర్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెటిఆర్ వారిని కోరారు.

తెలంగాణలో రేవ్ గేర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్
టెక్సాస్‌కు చెందిన ‘రేవ్ గేర్స్’కు చెందిన యాజమాన్య బృందం హ్యూస్టన్‌లో మంత్రి కెటిఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. కెటిఆర్‌తో సమావేశం అనంతరం తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రేవ్ గేర్స్ ఆసక్తి చూపింది.

కెటిఆర్‌తో టెక్ జెన్స్ ప్రతినిధి బృందం భేటీ
డిజిటల్ సొల్యూషన్స్, సప్లయి చైన్‌లో పేరొందిన టెక్ జెన్స్ కంపెనీ బృందం మంత్రి కెటిఆర్‌ను కలిసింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై చర్చించింది. ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్ థింకింగ్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతిపాదిత కేంద్రం, టెక్జెన్స్ కార్యకలాపాలకు ఊతమిస్తుందని, వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఆ సంస్థ ప్రెసిడెంట్ లక్ష్మి యనిగళ్ల, సిఇఒ రఘు కొమ్మరాజులు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News