Friday, April 26, 2024

జార్జియాలో తెలంగాణ విద్యార్థిని శివానికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

స్వదేశానికి తరలిస్తుండగా అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది

మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి ప్రతినిధి: జార్జియాలో అస్వస్థత గురైన తమ కూతురు శివాణిని ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి మెడిసన్ విద్యనభ్యసించేందుకు జార్జియా వెళ్లింది. అక్కడి అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. విషయం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని అసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వేంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లో కిమ్స్ అసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ సిబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్‌కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్‌కు రావడానికి అన్ని ఏర్పాటు చేశామని, చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Telangana Student has illness in Georgia

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News