Monday, April 29, 2024

హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు జవాన్

- Advertisement -
- Advertisement -

Telugu jawan killed in helicopter crash

ఉదయం భార్యకు ఫోన్.. అంతలోనే…

తిరుపతి: తమిళనాడులోని నీలగిరి కనుమల్లో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులు సహా 11 మంది దుర్మరణం పాలైన సంగతి విదితమే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ కూడా వున్నారు. చిత్తూరు జిల్లా కురబల కోటకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది. కురబలకోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ ఆర్మీలో లాన్స్ నాయక్ హోదలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాయితేజ్ బిపిన్ రావత్‌కు సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయితేజ్ మృతితో ఎగువరేగడి గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుము కున్నాయి. భార్య శ్యామలతో చివరిసారిగా బుధవారం ఉదయం 8.30 గంటలకు ఫోన్‌లో సాయితేజ మాట్లాడారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని. సాయితేజ మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు, సన్నిహితులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News