Monday, April 29, 2024

సైబరాబాద్‌లో ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Transfer of two inspectors in Cyberabad

ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. కెపిహెచ్‌బి ఇన్స్‌స్పెక్టర్‌గా కిషన్ కుమార్, రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్‌గా తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కెపిహెచ్‌బిలో ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న లక్ష్మినారాయణను మాదాపూర్ ఎస్‌బికి బదిలీ చేశారు. రాయదుర్గం ఇన్‌చార్జ్ ఇన్స్‌స్పెక్టర్‌గా రాజగోపాల్ రెడ్డి పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం మియాపూర్ ఇన్స్‌స్పెక్టర్‌గా తిరుపతి రావును నియమించారు. అక్కడ పనిచేస్తున్న వెంకటేష్‌ను సిబికి బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News