Monday, April 29, 2024

మోడీకి థ్యాంక్స్.. పండుగ కళ పోయింది

- Advertisement -
- Advertisement -
Thanks to PM Modi Festive spirit is gone Says Rahul
రాహుల్ వ్యంగ్య ట్వీట్

న్యూఢిల్లీ: అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరల వల్ల ప్రజలలో పండుగ ఉత్సాహం కనుమరుగైందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 11 రోజులలో లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35, డీజిల్ రూ. 3 పెరగడంతో సామాన్యులు ధరల భారంతో సతమతమవుతున్నారంటూ వచ్చిన ఒక పత్రికా కథనాన్ని రాహుల్ ఉటంకిస్తూ ఒక ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఆహార వస్తువులు, ఎల్‌పిజి ధరలు పెరుగుతూ పోతున్నాయని, పండుగ ఉత్సాహం కనుమరుగైనందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News