Saturday, April 27, 2024

బిజెపి అనైతిక చర్యను నిరసిస్తూ.. ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

The Modi effigy was burnt by TRS Activists

 

వరంగల్ రూరల్ : పరకాల ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి శ్రేణులు దాడి జరిపి విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో ఎంఎల్ఎ ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై టిఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. బిజెపి అనైతిక చర్యను  నిరసిస్తూ.. పరకాల పట్టణంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఎంఎల్ఎ ఇంటిపై దాడికి పాల్పడిన బిజెపి కార్యకర్తలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News