Monday, April 29, 2024

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ఎస్సీ, ఎస్టీ అ టాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్, సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశ ంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్.మోహన్ రావుతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయ ం జరిగేలా ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం ఏర్పాటు చేసి బాధితుల సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోర్టులలోఉన్న కేసులు పరిష్కారం అయ్యేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో 109 అట్రాసిటీ కేసుల పరిష్కార ంలో భాగంగా ఇప్పటి వరకు 36 మందికి దాదాపు రూ.26లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు.

సూర్యాపేట, కోదాడ సబ్ డివిజన్ల పరిధిలో 21 కేసులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డిఓ రా జేంద్ర కుమార్, డిఎస్‌డిఓ ద యానంద రాణి, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శిరీష, డిటిడిఓ శంకర్, డిఎస్పీలు నాగభూషణం, ర వి, కమిటి సభ్యులు చిన్న రాములు, సైదులు, ప్రకాష్, బాబు, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News