Monday, April 29, 2024

ఎంసెట్ బైపిసి విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -
సెప్టెంబర్ 2,3 తేదీల్లో స్లాట్ బుకింగ్, 4,5 తేదీల్లో దృవపత్రాల పరిశీలన

హైదరాబాద్: టిఎస్ ఎంసెట్ ద్వారా ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే బైపిసి విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ,బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సులో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో బైపిసి విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 4, 5 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన జరగనుంది. 4 నుంచి 7వ తేదీవరకు ఎంసెట్ బైపిపి అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని అవకాశం కల్పించారు. 11వ తేదీన బి ఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడుత సీట్ల కేటాయింపు చేస్తారు. సెప్టెంబర్ 17 నుంచి ఎంసెట్ బైపిసి తుది విడుత కౌన్సెలింగ నిర్వహించనున్నారు. 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సులకు తుది విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 24న స్పాట్ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News