Monday, April 29, 2024

గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, రైతు బీమా రద్దు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా నార్కోటిక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు, గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి చేస్తే ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్థాలను కళాశాల విద్యార్థులకు వివరించా లన్నారు. గంజాయి సాగు చేసినట్లు కనిపిస్తే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి అక్రమంగా రవాణా చేస్తే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా సరిమద్దు ప్రా ంతాల్లో డ్రగ్స్, గంజాయి రవాణా కాకుండా చర్యలు తీసుకుంటుం న్నామని ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండ్ రవీంద్ర రాజు, ఆర్టీవో వాణి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షుక్ సలాం, ప్రబుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య వివిద శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News