Saturday, April 27, 2024

ఎఎస్‌ఐని పొడిచి చంపిన దొంగ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: విధులు నిర్వహిస్తున్న ఎఎస్‌ఐని దొంగ పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజస్థాన్ రాష్ట్రం షికార్ జిల్లాకు చెందిన షంభూ దయాల్(57) అనే వ్యక్తి ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. షంభూ దయార్ తన భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. మాయపూరి ఫేస్‌లోని షాంటీలో ఓ వ్యక్తి తన భర్త వద్ద నుంచి మొబైల్ దొంగలించడంతో పాటు తమని బెదిరిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఆదివారం విచారణలో భాగంగా షంభూ అక్కడికి వెళ్లి నిందితుడు అనిష్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా నిందితుడు కత్తి తీసి ఎఎస్‌ఐ మెడ, ఛాతీ, పొట్టలో పొడిచాడు. వెంటనే ఎఎస్‌ఐని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎఎస్‌ఐ సోమవారం మృతి చెందాడు. ఢిల్లీలో పోలీస్ కమిషనర్ సంజయ అరోరా, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర ప్రీత్ హుడా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ బన్సాల్, తదితరలు
ఎఎస్‌ఐ మృతిపై సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News