Sunday, May 12, 2024

అభివృద్ధిలో ఇది ట్రైలరే

- Advertisement -
- Advertisement -

అసలు సినిమా ముందుంది : కెటిఆర్

పక్కా ప్రణాళికలు, మౌలిక వసతులతోనే నగరాలు, రాష్ట్రాల అభివృద్ధి

హైదరాబాద్ సత్ఫలితాలను ప్రపంచం చూస్తోంది

పడమర వైపే కాదు.. సౌత్ ఈస్ట్‌పైనా బిల్డర్లు దృష్టి సారించాలి

శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మెగా ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఐటి శాఖ మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల విలువ, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి సా ధించాలంటే మౌలిక వసతులపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్‌పో ర్టు మెట్రోతో పాటు ఓఆర్‌ఆర్ చుట్టూ 415 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందుకు పోతు న్నామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షో’ని ప్రారంభించి కెటిఆర్ మాట్లాడారు. ఏ నగరమైన ఒక రోజులో నిర్మాణం కాదని, కానీ, ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆయా నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయన్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పనపైన ప్రధాన దృష్టి సారించామని, ప్రభుత్వం చేపట్టిన ఆయా కార్యక్రమాల సత్ఫలితాలను ప్రస్తుతం ప్రపం చం చూస్తుందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం కరెంటు కోతలతో సతమతమయ్యేదని, ఈరోజు తెలంగాణలో 24 గంటల పాటు అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ అందిస్తుందన్నారు. గతంలో ప్రతి వేసవికాలంలో ట్యాంకర్లు లేకుండా నీటి సరఫరా సాధ్యమయ్యేది కాదన్నారు.
నగరంపై అనేకమంది ప్రముఖుల ప్రశంసలు
మంచినీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉండేదని, ధర్నాలు రాస్తారోకోలు జరిగేవని, ప్రస్తుతం అవి లేవన్నారు. కెసిఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నుంచి వందల కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. ప్రస్తుతం కోటి మంది ఉన్న హైదరాబాద్ నగర జనాభా మూడు కోట్లకు చేరినా, 2050 సంవత్సరం వరకు సాగునీటి భద్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన భారీ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా నీటిని కేటాయించామన్నారు. హైదరాబాద్ నగరంలో వచ్చిన అద్భుతమైన మార్పులను సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదలుకొని అనేకమంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రముఖులతో పాటు ప్రముఖ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్ అభివృద్ధిని ప్రత్యేకంగా తమ నివేదికల్లో పేర్కొంటున్నాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మౌలిక వస్తువుల కల్పన వేగంగా కొనసాగుతుందన్నారు. 35 ప్రాజెక్టులను జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో పూర్తి చేశామని, హైదరాబాద్ పెరుగుతున్న వేగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మౌలిక వసతుల కల్పన పైన మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరింతగా విస్తరించేందుకు కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
శాంతి భద్రతలు బాగుంటేనే నగరానికి భారీగా పెట్టుబడులు
నగరం బాగుండాలంటే శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. శాంతి భద్రతలు బాగున్నప్పుడే నగరానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రతి ఏడాది మత ఘర్షణలు లేదా కర్ఫ్యూ వంటివి ఎప్పటికప్పుడు కొనసాగేవని ఆయన తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క రోజు కూడా అలాంటి పరిస్థితి రాలేదన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం విద్యుత్, త్రాగునీరు శాంతి భద్రతల వంటి కీలకమైన అంశాల పైన దృష్టి సారించి వాటిని బలోపేతం చేయడంలో విజయం సాధించామన్నారు. అందుకే హైదరాబాద్ నగరం భారీగా విస్తరించి ముందుకు పోతుందన్నారు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం అమ్మకం కొనుగోలు మాత్రమే కాదనీ, ఈ రంగంపై రాష్ట్రంలో 30 లక్షల మంది ఆధారపడి పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
సౌత్, ఈస్ట్  హైదరాబాద్‌పై బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలి
హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని కొంతమంది విమర్శిస్తున్నారని, న్యూయార్క్ లాంటి నగరాల్లో కూడా కొన్ని పాత పట్టణాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. స్కై టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, గ్రీన్ బిల్డింగ్స్‌ను ప్రోత్సహిస్తున్నామని ఆయన వెల్లడించారు. డబ్బా బిల్డింగులే కాదు అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలని కెటిఆర్ సూచించారు. హైదరాబాద్ పడమరవైపే కాకుండా మిగతావైపు కూడా బిల్డర్లు అభివృద్ధి చేయాలన్నారు. అక్కడ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున వసతులు కల్పించిందని, సౌత్, ఈస్ట్ హైదరాబాద్‌పై బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News