పాల్ఘర్: వివాహితపై సామూహిక లైంగిక దాడి జరిగిన అమానుష సంఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా నల్సోపారాలో జరిగింది. ఈ ఘటన ఆగస్టు 11న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… నలసోపారాలోని రైల్వే స్టేషన్ దగ్గర్లో ఓ రిక్షా డ్రైవర్ తన భార్యతో కలిసి జీవనం గడుపుతున్నాడు. ఈ నెల 11తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదించారు. ఆమె ధైర్యం చేసి విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు నల్లసోపారా ఎఎస్ఐ శ్రీరాంగ్ గోసావి తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ ఆగస్టు20 వరకు కస్టడీ విధించినట్టు తీర్పునిచ్చారని చెప్పారు. దీంతో ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు.