Thursday, May 9, 2024

శ్రీలంకలో కొవిడ్ టీకాతో రక్తం గడ్డకట్టి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three die of blood clots in Covid vaccine in Sri Lanka

 

కొలంబో : కొవిడ్ 19 నివారణకు ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వేసుకున్న ముగ్గురు శ్రీలంక జాతీయులు రక్తం గడ్డకట్టి మృతి చెందారు. పార్లమెంటు లో విపక్షం అడిగిన ప్రశ్నకు శ్రీలంక ఆరోగ్యమంత్రి పవిత్ర వన్నియరచ్చి ఈ వివరాలు తెలియచేశారు. వ్యాక్సినేషన్ తరువాత రక్తం గడ్డకట్టినట్టు ఆరుగురు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇదే టీకా వేసుకున్న మంత్రి పవిత్ర మాట్లాడుతూ వ్యాక్సిన్‌కు రక్తం గడ్డకట్టడానికి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News