Sunday, May 12, 2024

రోడ్డు ప్రమాదంలో కుటుంబం సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

Three Members dead in Car accident in Karnataka

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని మళవళ్లిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం  చోటుచేసుకుంది. రోడ్డు పక్కనున్న రాయిని కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షేక్ కైజల్ అనే వ్యక్తి (45) కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులు భార్య మెహక్(33), ఐహిల్(06), మెహైరా(11), సుహాన(12)తో కలిసి కొళ్లెగాలకు వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా హలగూరు భారతీయ పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్ ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో మంటలు చెలరేగడంతో షేక్ కైజల్, సుహాన, షేక్ ఐహిల్ చనిపోయారు. క్షతగాత్రులను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News