Saturday, April 27, 2024

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Rajender nagar

 

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహారాష్ట్రాకు చెందిన జమీల్, బబ్లూ, ఖమరుద్దీన్ అనే యువకుడు పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై చాంద్రాయణగుట్ట నుంచి దుర్గానగర్ వెళ్తున్నారు. సిమెంట్ లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు దుర్మరణం చెందారు. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ డిసిపి వెంకట్ రెడ్డి, ఎసిపి విజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News