Thursday, May 9, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. నిన్నటితో పోలిస్తే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి 3గంటలు సమయం పడుతోందని తెలిపారు.

కాగాగురువారం శ్రీవారిని 58,278 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 20,157 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News