Tuesday, April 30, 2024

తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుదంటే..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు. టికెట్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, బుధవారం శ్రీవారి 62,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 8,555 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News