Saturday, April 27, 2024

సెమీస్‌లో సింధు ఓట‌మి.. కాంస్యం కోసం మ‌రో మ్యాచ్‌

- Advertisement -
- Advertisement -

Tokyo Olympics: PV Sindhu loses Semifinal to Ti Tzu Ying

టోక్యో:  ఒలింపిక్స్ బ్యాడ్మింట‌న్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఓట‌మిపాలైంది. ప్రపంచ నంబర్ వ‌న్‌ చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో 21-18, 21-12 స్కోర్‌ తేడాతో సింధు ఓడిపోయింది. దీంతో సింధు గోల్డ్ ఆశ‌లు ఆవిరి కాగా.. తైజు యింగ్ ఫైన‌ల్ కు చేరుకుంది. మొదటి నుంచి సిందుపై ఆధిపత్యం చేలాయిస్తూ వచ్చిన తైజు యింగ్ వేగంగా పాయింట్లను సాధించింది. దీంతో వ‌త్తిడికి గురైన సింధుకు తైజు యింగ్ మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ ను ముగించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కాంస్య పతకం గెలిచేందుకు సింధుకు మరో అవకాశం ఉంది. మరో సెమిఫైనల్ లో ఓడిపోయిన చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో సింధు ఆదివారం పోటీ పడనుంది. ఇందులో విజయం సాధిస్తే సింధు కాంస్య పతకాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.

Tokyo Olympics: PV Sindhu loses Semifinal to Ti Tzu Ying

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News