మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహారావు విగ్రహ ఆవిష్కరణ
హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నర్సింహారావు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నెక్లెస్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్టు, రాజ్భవన్ నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్పైకి అనుమతించరు. షాదన్ కాలేజీ, నిరంకారీ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. మినిస్టర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే వాహనాలను బుద్ధ భవన్ నుంచి నల్లగుట్ట బ్రిడ్జివైపు మళ్లిస్తారు. ట్యాంక్బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్ నుంచి సానా బాయి మసీద్వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ నుంచి ట్రాఫిక్ పిఎస్ సైఫాబాద్ వైపు మళ్లిస్తారు. తెలుగుతల్లి నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లాలి.
పార్కింగ్ ప్రాంతాలు…
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సంజీవయ్య పార్క్లో పార్కింగ్ చేయాలి. అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలు అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి,బుద్ధ భవన్ వెనుక వైపు నుంచి వచ్చి సంజీవయ్య పార్క్లో పార్క్ చేయాలి.