Saturday, April 27, 2024

గాల్లో కలిసిన ముగ్గురి ప్రాణాలు

- Advertisement -
- Advertisement -

Travel by standing near the plane tires:3 dead

ఎగిరిన కాసేపట్లోనే కింద రాలిపడ్డ వ్యక్తులు
అఫ్ఘనిస్తాన్‌లో హృదయవిదారక దృశ్యం

కాబుల్: అఫ్ఘనిస్థాన్‌లో భయానక, హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశం తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు భవిష్యత్‌లో జరగబోయే దారుణాలను ఊహించుకుని దేశాన్ని వీడి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ఏదో రకంగా దేశం దాటి ప్రాణాలు కాపాడుకోవాలని సాహసం చేసిన ముగ్గురి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. విమానంలో చోటు లేకపోవడంతో దాని టైర్ల దగ్గర నిల్చోని ప్రయాణించేందుకు సిద్ధపడ్డారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పిట్టల్లా వారు కిందపడి మృతిచెందారు. ఇందుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఓ వీడియోను తెహ్రాన్ టైమ్స్ ట్విటర్ వేదికగా పంచుకొంది. మరో వీడియోలో విమానాశ్రయం రన్‌వేపై నుంచి బయలుదేరుతున్న విమానం వద్ద గుంపులుగుంపులుగా ఉన్న జనం ఆ విమానాన్ని ఎక్కేందుకు పరుగులు తీస్తున్నారు. విమానం టైర్లు, హ్యాండిళ్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకొని దేశాన్ని వీడి వెళ్లేందుకు విమానం వెంట పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో అక్కడి ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News