- Advertisement -
టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దాదాపుగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న త్రిష కెరీర్ తుది దశకు చేరుకుంది అనుకుంటున్న ప్రతి సారి కూడా ఆమె బ్లాక్బస్టర్ సినిమాలతో తిరిగి దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ మరో బిగ్ మూవీకి కమిట్ అయింది. అయిదు సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో వచ్చిన ‘పీకు’ మూవీ రీమేక్లో త్రిష నటించబోతోంది. ఈ రీమేక్ను తెలుగు, తమిళంలో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. పీకు మూవీలో దీపిక పదుకునే పోషించిన పాత్రలో త్రిష నటించబోతోంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ రీమేక్లో ఆ పాత్రను ఎవరు చేస్తారు అనేది చూడాలి. ఈ ఛాలెంజింగ్ రోల్కు త్రిష ముందుకు వచ్చింది.
- Advertisement -