Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్ గెలుపు ఖాయం: కోలేటి దామోదర్

- Advertisement -
- Advertisement -

TRS win in Huzurabad confirmed: Koleti Damodar

మనతెలంగాణ/ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సమర్థ నాయకత్వంతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అందరికి చేరాయని తెలిపారు.హుజురాబాద్ ప్రజలందరూ టిఆర్‌ఎస్ పక్షాన నిలిచారని గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించనున్నారని వెల్లడించారు. ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమించిన టిఆర్‌ఎస్‌కు పట్టం కడుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News