Saturday, April 27, 2024

ఈ వేలంలో భూముల విక్రయం

- Advertisement -
- Advertisement -

పారదర్శకంగా ప్రక్రియ
కొనుగోలుదారులకు చిక్కులు తలెత్తకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు
భూముల అమ్మకానికి వివిధ కమిటీలు
జీఓ 13ను జారీ చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గ నిర్ణయం మేరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధశాఖల దగ్గర ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణా విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయించాలని, అమ్మే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అమ్మకానికి పెట్టిన భూములను మల్టీపర్పస్ జోన్ గా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కొనుగోలుదార్లకు అవసరమైన అన్ని రకాల అనుమతులను మంజూరు చేయాలని సూచించింది.
టిఎస్ బిపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో
అందులో భాగంగా భూముల విక్రయం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ-వేలం ద్వారా పారదర్శక విధానంలో ఆయా నోడల్ శాఖలు, ఏజెన్సీల ద్వారా భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలుదార్లకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, అనుమతులకు ఇబ్బందులు లేకుండా నిర్దిష్ట విధానాలను ఖరారు చేసింది. బహుళ వినియోగానికి వీలుగా భూములను అవసరమైన జోన్‌లో చేర్చడంతో పాటు టిఎస్ బిపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివిధ కమిటీల ఏర్పాటు
భూముల విక్రయం కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. నోడల్ శాఖ భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ నిర్వహించనుంది. భూముల అమ్మకాల్లో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో ‘ఈ-వేలం’ ద్వారా విక్రయాలు చేయనున్నారు.
విక్రయించేందుకు రంగం సిద్ధం
నిధుల సమీకరణ కోసం భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కసరత్తును వేగవంతం చేస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న భూములను ఈ-వేలం ద్వారా పారదర్శక విధానంలో విక్రయించాలని నిర్ణయించింది. అమ్మకం కోసం మార్గదర్శకాలు ఖరారు చేసిన ప్రభుత్వం, నోడల్ శాఖలు అనుసరించాల్సిన నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రకటించింది.
సింగిల్ విండో విధానం
విక్రయించే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా, అనుమతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఆ భూములను బహుళార్ధకంగా ఉపయోగించుకు నేందుకు వీలుగా తగిన జోనింగ్ విధానాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి నుంచి అవసరమైన అనుమతులను ఇవ్వాలని పేర్కొంది. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చాలని తెలిపింది. అనుమతులు సైతం టిఎస్ బిపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ- వేలం ద్వారా..
ప్రభుత్వం ప్రకటించే నోడల్ శాఖ ఈ-వేలానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈ-వేలాన్ని నిర్వహిస్తారు. భూముల కనీస ధరను నిర్ణయించడం, ఈ- వేలం షెడ్యూల్ ప్రకటన, మార్కెటింగ్, కన్సల్టెంట్ల సేవలు వినియోగం, బిడ్ల ఆమోదం, తదితరాలను నోడల్ ఏజెన్సీ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ-వేలం ద్వారా భూమిని పొందిన వారికి డబ్బులు చెల్లించిన ఏడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాల్సి ఉంటుంది.
ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ
భూముల అమ్మకం ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, పురపాలక, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
వివాదాలు లేకుండా
న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ ఏర్పాటు చేయగా ఇందులో న్యాయశాఖ కార్యదర్శి, సిసిఎల్‌ఏ ప్రతినిధి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజి, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అవసరమైన అన్ని అనుమతుల పర్యవేక్షణ కోసం అప్రూవల్ కమిటీని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ కమిషనర్లు, దక్షిణ డిస్కం, జలమండలి ఎండిలు, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి ఈ కమిటీలో ఉంటారు.
ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
అమ్మకం కోసం భూములను సిద్ధం చేయడం, సదుపాయాలు కల్పించడం, అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం లాంటి వాటి కోసం యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండిఏ కమిషనర్, గృహనిర్మాణ సంస్థ ఎండి, టిఎస్‌ఐఐసీ ఎండి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశ్రమల శాఖ తరఫున జీఓ 13లో ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

TS Govt finalized guidelines for sale of govt lands

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News