Friday, May 3, 2024

జగ్గయ్యపేటలో లారీని ఢీకొట్టిన టిఎస్‌ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని బస్సు ఢీకొట్టడంతో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణకు చెందిన రాజధాని ఆర్‌టిసి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్ధం రావడంతో నిద్రలో ఉన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణికుల సమాచారం మేరకు టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News