హైదరాబాద్: వెండి తెర మాజీ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గతంలో రేఖ సింగర్గా స్థిరపడాలని ఆంధ్రా నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. వెండితెరపై రెండు సీరియల్స్లో నటించిన అనంతరం అవకాశాలు రాకపోవడంతో గుంటూరుకు చెందిన అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె కలిసి జీవిస్తోంది. వేడకలు, కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నప్పుడు చైతన్య పరిచయం కావడంతో అతడిని వివాహం చేసుకొని విద్యానగర్లోని నాలుగో లైనులో ఉంటుంది. గత రెండేళ్ల నుంచి పాటలు పాడటం మానేసింది. భర్త చైతన్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. స్నానానికి అని బాత్రూమ్ వెళ్లి రేఖ రాకపోవడంతో భర్త చైతన్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ హనుమంతరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని బలవంతంగా స్నానాల గది తలుపులు పగలగొట్టాడు. రేఖ ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వెండితెర మాజీ నటి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -