Sunday, May 12, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీ5, ఏబీఎన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి రఘురామ కృష్ణరాజు వ్యవహారంలో ఎపి ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంతో టివి5 ఛానల్, ఎబిఎన్ మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎంపి రఘురామ విద్వేష ప్రసంగాలు ప్రసారం చేశారని తమపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టి, ఎఫ్‌ఐఆర్ లో చేర్చారని కోర్టుకు తెలిపాయి. తమ సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆ మీడియా సంస్థలు అభ్యర్థించాయి. రాజద్రోహం కేసులో దర్యాప్తుపై స్టే విధించి, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని టివి 5 ఛానల్, ఎబిఎన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.

TV5 and ABN Channels file petition in Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News