Saturday, May 11, 2024

వరంగల్ లో దారుణం: వైద్యం వికటించి కవలలు మృతి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఎంజిఎం: వరంగల్ గంగా ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరు కవలలు మృతిచెందిన ఘటన వరంగల్ గంగా ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకుంది. గర్భిణీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కాశిబుగ్గకు చెందిన శ్రీవాణి గంగ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం గంగా ఆస్పత్రి వైద్యులను సంప్రదించామని, డెలవరి అయ్యే గర్భవతికి ఇవ్వవలసిన ఇంజక్షన్ ఆరు నెలల గర్భిణీ శ్రీవాణికి ఇవ్వడంతో ఇద్దరు కవలలు మృతిచెందారని ఆరోపించారు. ప్రాణాలు కాపాడడం కోసం ఆస్పత్రికి వస్తే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పసికందుల ప్రాణాలు పోయాయని శ్రీవాణి కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. గంగా ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీవాణి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

Twins died after treatment failed in Ganga Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News