Friday, April 26, 2024

సూర్యాపేటలో రోడ్డుప్రమాదం: ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in road accident at Suryapet

నేరెడుచర్ల: రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మండలం ముత్యాలమ్మ కుంట అడ్డరోడ్డుపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి కథనం ప్రకారం… గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు నక్క సాయి, బొమమరబోయిన వెంకటేష్, నక్క రవి, బొడ్డు మధు కలిసి రెండు బైకులపై నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని వెంకటేష్ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లారు. తిరిగి పొనుగోడు గ్రామానికి వచ్చే క్రమంలో సాయి, మధు ఒక బైక్‌పై, వెంకటేష్, రవి మరో బైక్‌పై ప్రయాణిస్తున్నారు.

వీరు నేరెడుచర్ల మండలం ముత్యాలమ్మ కుంట అడ్డరోడ్డు వద్దకు చేరుకునే సమయంలో గుర్తు తెలియని వాహనం బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేరెడుచర్లకు చెందిన 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో వీరిని మేళ్లచెరువు, పెన్‌పహాడ్‌కు చెందని 108 వాహనంలో మిర్యాలగూడెం ఏరియా దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలో నక్క సాయి(18) మృతి చెందాడు. చికిత్స పొందుతూ బొమ్మరబోయిన వెంకటేష్(21) మృతి చెందాడు. బొడ్డు మధు, నక్క రవి చికిత్స పొందుతున్నారు. సాయి తండ్రి నక్కా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News