- Advertisement -
ఒడిశా: నాయగర్ జిల్లాలోని రాన్పూర్ ప్రాంతంలో అటవీ సమీపంలో క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) అధికారులు రెండు చిరుతపులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టిఎఫ్ బృందం నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 2 చిరుతపులల చర్మంతో పాటు ఇతర జంతువుల ఎముకలను స్వాధీనం చేసుకుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి ఎముకలు డెహ్రాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పరీక్ష కోసం పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక్కడేనా ఎక్కువ మంది ఉన్నారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Two Leopard Skin Seized in Nayagarh District
- Advertisement -