Friday, April 26, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

రాజన్నసిరిసిల్ల: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్, వెంకటేశ్ బైక్‌పై సిరిసిల్లకు వెళ్తుండగా వేములవాడ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సిరిసిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంకుశాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News